Telugu govt jobs   »   Weekly Current Affairs   »   AP and Telangana State September Weekly...

AP and Telangana States September Weekly Current Affairs , ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సెప్టెంబర్ వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of September 4th week.

 

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana States September Weekly Current Affairs |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State Weekly Current Affairs

1. నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు తొలిసారి డ్రోన్‌తో మందుల సరఫరా

Drug delivery by drone
Drug delivery by drone

టీశా – మెడికార్ట్‌ అనే స్టార్టప్‌ కంపెనీ డ్రోన్‌ ద్వారా ఔషధాల సరఫరా ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు విజయవంతంగా చేరవేసింది. నిర్మల్‌ పట్టణంలో వైద్యుడు ప్రశాంత్‌ ఆ మందులను స్వీకరించారు. నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌ దాదాపు 70 కి.మీ. దూరంలో ఉంది. డ్రోన్‌తో అరగంట కన్నా తక్కువ సమయంలోనే ఔషధాలు నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాయి. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్‌ ఎక్కడకు చేరుకోవాలో, ఎలా చేరుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారు. భూమికి 400 అడుగుల పైన గాలిలో ప్రయాణించే ఈ డ్రోన్‌ చేరుకోవాల్సిన ప్రదేశంలో క్యూఆర్‌ కోడ్‌ను అతికిస్తారు. 60 మీటర్ల దూరం నుంచే ఆ క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేసి డ్రోన్‌ అక్కడ దిగుతుంది. ఈ విధానంలో 20 కిలోల వరకూ మందులను సరఫరా చేసేందుకు అవకాశమున్నట్లు వైద్యుడు ప్రశాంత్‌ తెలిపారు.

2. తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు

13 new mandals in Telangana
13 new mandals in Telangana

 

రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. గతంలోనే వీటికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయింది. తాజాగా ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్‌ 3) ప్రకారం ఈ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెప్టెంబర్ 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మండలాలన్నీ సెప్టెంబర్‌ 26, 2022 నుంచి ఉనికిలోకి వస్తాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫైనల్‌ గెజిట్‌లో పేర్కొంటున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. జగిత్యాల, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ కొత్త మండలాలను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే 607 మండలాలు ఉండగా, ఇప్పుడు మరో 13 కొత్తగా ఏర్పాటు కావడంతో రెవెన్యూ మండలాల సంఖ్య 620కి చేరింది.

3. ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మరోసారి హరీశ్‌రావు

the President of the Exhibition Society
the President of the Exhibition Society

ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా 2వ సారి ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్‌రావు, ఉపాధ్యక్షుడిగా అశ్వినీ మార్గం, కార్యదర్శిగా సాయినాథ్‌ దయాకర్‌ శాస్త్రి, సంయుక్త కార్యదర్శి వనం సురేందర్, కోశాధికారిగా పాపయ్య చక్రవర్తితోపాటు మరో ఏడుగురు మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా నామినేషన్‌ దాఖలు చేయగా, పోటీగా మరెవ్వరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. కొత్త కమిటీని 30న ఎగ్జిబిషన్‌ సొసైటీ అధికారికంగా ప్రకటించనుంది.

4. మెదక్ నుంచి తొలి ప్యాసింజర్ రైలు ప్రారంభం

First passenger train starts from Medak
First passenger train starts from Medak

మెదక్‌ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సెప్టెంబర్ 23న మెదక్‌లో రైలు కూత వినిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మెదక్‌–అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ మధ్య నూతన రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తూ మెదక్‌ నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్‌ రైలును మెదక్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

  • మెదక్‌–అక్కన్నపేట వరకు 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్‌ కోసం రూ.205 కోట్లు వ్యయమైందన్నారు.
  • మెదక్‌ నుంచి రెండు ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌–ముంబై ట్రాక్‌కు కనెక్ట్‌ చేస్తారని చెప్పారు.

AP and Telangana States September Weekly Current Affairs |_180.1

 

Andhra Pradesh State Weekly Current Affairs

1. ఆకట్టుకుంటున్న RBK చానల్‌

RBK Channel
RBK Channel

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను నాలెడ్జ్‌ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నదాతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్‌ విశేష ఆదరణతో దూసుకుపోతోంది.

రెండేళ్లలోనే 1.95 లక్షల సబ్‌స్క్రైబర్లను, 21.50 లక్షల వ్యూయర్‌షిప్‌ను సాధించింది. రైతులతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభినందనలూ చూరగొంటోంది.

ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నూతన సాగు విధానాలను రైతులకు చేరువ చేసే లక్ష్యంతో యూట్యూబ్‌లో ఈ చానల్‌ను ఏర్పాటు చేశారు. ప్రసారాల వివరాలను ఎప్పటికప్పుడు ఆర్బీకేల పరిధిలోని వాట్సాప్‌ గ్రూపుల ద్వారా రైతులకు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సబ్‌స్క్రైబర్లకు తెలియజేస్తున్నారు. ఈ చానల్‌ కోసం గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఐసీసీ కాల్‌ సెంటర్‌)లో ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ చానల్‌ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. శాస్త్రవేత్తల ద్వారా రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆదర్శ రైతుల అనుభవాలను తెలియజేస్తున్నారు. వైఎస్సార్‌ యంత్రసేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు వివరించేందుకు రైతు గ్రూపులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ చానల్‌ ద్వారా 371 ప్రత్యక్ష ప్రసారాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన 895 రైతు ప్రాయోజిత వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. ఆర్బీకే 2.0 వెర్షన్, ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రసారం చేసిన కార్యక్రమానికి అత్యధికంగా 87,233 వ్యూయర్‌షిప్‌ లభించింది. రైతులు ఈ చానల్‌ కార్యక్రమాలను వీక్షించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్‌ నుంచి సిల్వర్‌ బటన్‌ను కూడా సాధించింది.

2. ఎన్‌ఎస్‌ఐసీ – ఏపీమెడ్‌టెక్‌ మధ్య ఒప్పందం 

Agreement between NSIC and APMedTech
Agreement between NSIC and APMedTech

వైద్య పరికరాల ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకోవాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐసీ), ఏపీ మెడ్‌టెక్‌ జోన్లు నిర్ణయించాయి. ఈ మేరకు కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్‌ రాణే సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎంఓయూపై ఎన్‌ఎస్‌ఐసీ సీఎండీ గౌరంగ్‌ దీక్షిత్, ఏపీమెడ్‌టెక్‌ జోన్‌ ఎండీ, సీఈఓ జితేంద్రశర్మలు సంతకాలు చేశారు.

3. Ramco Cements కర్మాగారాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Ramco Cements factory
Ramco Cements factory

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన ‘రామ్‌కో సిమెంట్స్‌’ కర్మాగారాన్ని సెప్టెంబర్ 28న సీఎం జగన్ మోహన్ రెడ్డి బజర్ నొక్కి ప్రారంభించారు.

అంతకు ముందు ఫ్యాక్టరీలోని పరికరాలు, టెక్నాలజీ, ఉత్పత్తి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్‌కో ఇండస్ట్రీ వల్ల మన ప్రాంతానికి, మనకు మంచి జరుగుతుందన్నారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతంలో లైమ్‌ స్టోన్‌ మైన్స్‌ ఉన్నప్పటికీ గతంలో ఎలాంటి పరిశ్రమలు లేవని ప్రస్తుతం ఇక్కడ 2 మిలియన్‌ టన్నుల క్లింకర్, 1.5 మిలియన్‌ టన్నుల గ్రైండింగ్‌ సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటైందన్నారు. తద్వారా 3 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి అవుతుందని, ఇది తొలి దశ మాత్రమేనని రాబోయే రోజుల్లో యాజమాన్యం దీన్ని విస్తరిస్తుందని అన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో మెరుగైన వసతులు వస్తాయని, సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ – సామాజిక బాధ్యత) వల్ల చుట్టుపక్కల గ్రామాలకు మంచి జరుగుతుందని తెలిపారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని చట్టం చేయడం వల్ల మన పిల్లలకు మంచే జరుగుతుందని వివరించారు.

4. శిక్షణ కార్యక్రమాలపై ఏపీ శాక్స్, ఎకో ఇండియా ఒప్పందం

శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిల్లీకి చెందిన ఎకో ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (ఏపీ శాక్స్‌) ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని ఏపీ శాక్స్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శాక్స్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జీఎస్‌ నవీన్‌కుమార్‌ సమక్షంలో ఏపీడీ డాక్టర్‌ కామేశ్వర్‌ప్రసాద్, ఎకో ఇండియా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ సందీప్‌ భల్లాలు ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు.

adda247

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!