Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2023 – 4వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2023 – 4వ వారం| డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్: APPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  కరెంట్ అఫైర్స్ మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా  నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ను ఇక్కడ అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు సమకాలీన అంశాలు 2023 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్

1. అచ్యుతాపురం సెజ్ లో 5 ఎంఎల్ డీ సీఈటీపీకి APIIC నిర్మించనుంది

APIIC plans for 5 MLD CETP in Atchutapuram SEZ

విశాఖపట్నం- చెన్నై కారిడార్ లో ఉన్న అచ్యుతాపురం SEZ లో (APIIC) ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పారిశ్రామిక వ్యర్ధాల శుద్ధికి 5 ఎంఎల్ డి కామన్ ఇఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (CETP)ను ఏర్పాటు చేయనుంది. 540 కోట్లతో 34 ఎకరాల విస్తీర్ణం లో ఈ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. DBFTO డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ట్రాన్స్ఫర్, ఆపరేట్ విధానంలో దీని అభివృద్ది చేస్తున్నారు. ఈ ప్లాంట్ ప్రధానంగా అనకాపల్లి జిల్లా SEZ లో ఉన్న ఫార్మా, రసాయనాల యూనిట్ల నంచి విడుదలఎఎ వ్యర్ధ జలాలను శుద్ధి చేయనుంది. ఇప్పటికే 1.5MLD సమర్ధ్యాన్ని 2 MLD కి పెంచానున్నారు మరియు 3 MLD ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ADB రుణంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు

AP State Weekly CA December 2023 1 and 2nd week in Telugu PDF

2. వైఎస్సార్ జిల్లా రైతు కె.విజయ్ కుమార్ కు సృష్టి సమ్మాన్ అవార్డు-2023

YSR District Farmer K.Vijay Kumar Awarded Srushti Samman Award-2023

అహ్మదాబాద్ లో జరుగుతున్న సాత్విక్ సంప్రదాయ ఆహారోత్సవం-2023 కార్యక్రమం లో భాగంగా అందించే సృష్టి సమ్మాన్ పురస్కారం ఐఐఎం అహ్మదాబాద్ మాజీ ప్రొఫెసర్ అనిల్ గుప్తా చేతులు మీద వైఎస్ఆర్ జిల్లా కి చెందిన సేంద్రీయ రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్ కు సృష్టి సమ్మాన్ – 2023 పురస్కారం లభించింది. విజయ్ కుమార్ సేంద్రీయ పద్దతిలో చిరు ధాన్యాల సాగు పై విశేష కృషి చేశారు. ఈ పురస్కారం మార్ జీవవైవిధ్యం విభాగంలో లభించింది. ప్రొ. అనిల్ కె గుప్తా నెలకొల్పిన సొసైటి ఫర్ రిసెర్చ్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ (సృష్టి), 1995 నుంచి ప్రతి సంవత్సరం గ్రామీణ రైతు శాస్త్రవేత్తలు, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు ఈ సృష్టి సమ్మాన్ అవార్డులు అందిస్తున్నారు.

3. జేసీఐ ‘ఔట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డు అందుకున్న సిద్ధా సుధీర్

Sidda Sudheer bags JCI's ‘Outstanding Business Entrepreneur’ Award

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం సభ్యుల నుండి నామినేట్ చేయబడిన వ్యక్తులకు మూడు ఉత్తమ వ్యాపారవేత్తలు / పారిశ్రామికవేత్త / ప్రొఫెషనల్ అవార్డులను అందిస్తుంది. ఈ సంవత్సరం బెంగళూరులో బుధవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ ఎస్ లాడ్ హాజరయ్యారు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్సీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు సిద్ధా సుధీర్ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ నేషనల్ లెవల్ ఔట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తన బాధ్యతను పెంచిందని, జేసీఐ నెట్ వర్క్ కు తన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.

AP State Weekly CA December 2023 3rd week in Telugu

4. ఆంధ్రప్రదేశ్ లో 8.13 శాతం తగ్గిన నేరాల రేటు

Crime Rate in AndhraPradesh Decreased by 8.13%

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి 2022, 2021 సంవత్సరాలతో పోలిస్తే 2023లో రాష్ట్రంలో నేరాలు తగ్గాయని, రాష్ట్రంలో నేరాలను అరికట్టడానికి పోలీసు శాఖ చేపట్టిన విజిబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చింది అని తెలిపారు. గురువారం రాష్ట్ర పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో 2022లో 1,75,612 కేసులు నమోదు కాగా, 2023లో 1,61,334 నేరాలు నమోదయ్యాయి మరియు  ఏడాదిలో 8.13 శాతం నేరాల రేటు తగ్గింది.

విభాగాల వారీగా ఉన్న వివరాలలో హత్యలు, హత్యాయత్నం కేసులు 10 శాతం, దోపిడీలు 28.57 శాతం, దొంగతనాలు 37.24 శాతం, పగటి దొంగతనాలు 13.41 శాతం, రాత్రి దొంగత నాలు 13.54 శాతం, రోడ్డు ప్రమాదాలు 7.83 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 15.20 శాతం, సైబర్ నేరాలు 25.52 శాతం తగ్గాయని తెలిపారు.

5. SPMVV EUSAIతో ఒప్పందంపై సంతకం చేసింది

SPMVV Signs Agreement with EUSAI

తిరుపతి లో ఉన్న శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం అమెరికా కి చెందిన ఎలైట్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం SPMVV ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సరోజినీ, EUSAI హైదరాబాద్ శివకుమార్ మధ్య జరిగినది విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ డి.భారతి సమక్షంలో ఒప్పందం పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా  విశ్వవిద్యాలయంలో క్రీడలను ప్రోత్సహించనున్నారు, క్రీడలకు ఒక వేదికను కల్పించి అందరినీ భాగస్వామ్యం చేయనున్నారు, యూనివర్సిటీలో జరిగే  క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈవెంట్స్ లకు ప్రయాణ ఖర్చులు అందిస్తారు.
APPSC Group 2 Target Prelims Batch | Online Live Classes by Adda 247
 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!