Approval For 662 PM Sri Schools In Andhra Pradesh | ఆంధ్ర ప్రదేశ్లోని 662 PM శ్రీ పాఠశాలలకు ఆమోదం
662 government schools in the state have been selected for implementation of Prime Minister’s Schools for Rising India (PMSRI Schools) scheme. The school list was approved by the Central Education Department on April 18, 2023. These schools serve to achieve holistic development of students at all levels including equity, access, quality and inclusion.
ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ పాఠశాలల) పథకం అమలుకు రాష్ట్రంలోని 662 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. స్కూళ్ల జాబితాను కేంద్ర విద్యాశాఖ ఏప్రిల్ 18,2023 న ఆమోదముద్ర వేసింది. ఈక్విటీ, యాక్సెస్, క్వాలిటీ మరియు ఇన్క్లూజన్తో సహా అన్ని స్థాయిలలో విద్యార్ధులు సంపూర్ణమైన అభివృద్ధి సాధించేందుకు ఈ స్కూళ్లు ఉపయోగపడనున్నాయి.
APPSC/TSPSC Sure shot Selection Group
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అమలు చేయడానికి మరియు కాల వ్యవధిలో ఆదర్శప్రాయమైన పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి కొత్త కేంద్ర ప్రాయోజిత PMSHRI (PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని 07 సెప్టెంబర్ 2022న కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దేశవ్యాప్తంగా 14,500 PM SHRI పాఠశాలలను స్థాపించడం ఈ పథకం యొక్క లక్ష్యం.
పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశిస్తూ వాటి ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది. కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆన్లైన్ చాలెంజ్ పోర్టల్ ద్వారా స్కూళ్లు స్వయంగా వీటికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను మూడుదశల్లో పరిశీలించి తుది ఎంపికను ఖరారు చేశారు.
కేంద్ర విద్యాశాఖ నిబంధనల ప్రకారం అర్బన్ స్కూళ్లు 70 శాతానికిపైగా, గ్రామీణ ప్రాంత స్కూళ్లు 60 శాతానికిపైగా స్కోరు సాధించగలిగితేనే పీఎంశ్రీ పథకానికి అర్హమైనవిగా గుర్తిస్తారు. పాఠశాలలను కేంద్ర విద్యాశాఖ బృందాలు భౌతికంగా కూడా సందర్శించి నిర్దేశిత ప్రమాణాలతో ఉన్నాయో లేదో పరిశీలించిన తరువాతే ఎంపిక చేశారు. మన రాష్ట్రం నుంచి అందిన దరఖాస్తుల్లో మొత్తం 662 స్కూళ్లను పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేశారు. వీటిలో 33 ప్రాథమిక పాఠశాలలుండగా 629 సెకండరీ, సీనియర్ సెకండరీ స్కూళ్లు ఉన్నాయి.
పాత పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, పరికరాలతో అప్గ్రేడ్ చేయడం ద్వారా మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నది కూడా ఈ పథకం లక్ష్యం. ఈ పాఠశాలలను దశలవారీగా స్మార్ట్ తరగతులతో తీర్చిదిద్దనున్నారు. కేంద్రం నిధులు అందించే ఈ పాఠశాలలన్నీ నూతన విద్యావిధానాన్ని అనుసరించి కొనసాగుతాయి. మొత్తం నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఇస్తే మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఎంపికైన స్కూళ్ల జాబితాను కేంద్రం ఏర్పాటుచేసిన పోర్టల్లో ఉంచడంతోపాటు ఆయా రాష్ట్రాల విద్యాశాఖ కార్యాలయాలకు పంపింది.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |